ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ కేసును సుప్రీం కోర్టులో సవాలు చేయాల్సింది: ఐవైఆర్ కృష్ణారావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 04:46 PM

ఏపీ ప్రభుత్వం పై యుద్దం ప్రకటించిన వైసీపీ రెంబల్ ఎంపీ రఘు రామకు ఓ కేసు విషయంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర సలహా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ ద్వారా రుణం పొందే అంశంపై సుప్రీం కోర్టులో కేసు వేయాల్సింది అని రఘు రామకు ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.


ఇదిలావుంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయాన్ని చూపించి.. ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్‌ చట్టం(1993)కి సవరణ చేసింది. ఈ సవరణ చట్టాల(యాక్ట్‌ 31/2021, యాక్ట్‌ 9/2022)ను సవాల్‌ చేస్తూ రఘురామ కోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపింది. ఈ క్రమంలో రఘురామ లాయర్ వాదనలు వినిపించారు. పథకాలను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదన్నారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి చేసిన అప్పుల చేస్తోందన్నారు.


ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ ద్వారా రుణం పొందే అంశంపై హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిల్ వేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఈ పిల్‌ను కొట్టేసింది.. దీంతో ఈ అంశంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఎంపీ రఘురామను ట్యాగ్ చేస్తూ.. ఆయన కొన్ని సూచనలు చేశారు.


ఫలానా విధానంలోనే రుణం పొందాలని ఎలా చెబుతారని పిటిషనర్‌‌ను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని శాసించడానికి 'మీరెవరని' ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా ఉందో లేదో ఆర్‌బీఐ, కాగ్‌ చూసుకుంటాయి అన్నారు. ఈ వ్యవహారంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని.. ఈ తరహా పిల్స్ ప్రోత్సహిస్తే రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లను కూడా కోర్టుల్లో సవాల్‌ చేస్తారంది. పిల్‌ను విచారణకు స్వీకరించలేమని.. ఇందులో తాము తగిన ఉత్తర్వులు ఇస్తామని.. ఒకవేళ వాటిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను కోర్టులు నడిపించలేంది.


దీనిపై తాజాగా స్పందించిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు పలు సూచనలు చేశారు. సుప్రీంకోర్టులో అప్పీలు వేయాల్సిన కేసు ఇది. హైకోర్టు ఈ కేసులో ఇమిడి ఉన్న అంశాలను పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చి ఉంటే బాగుండేది అని వ్యాఖ్యానించారు. అడ్మిషన్ స్టేజ్ లోనే తిరస్కరింప దగిన కేస్ అయితే కాదన్నారు. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఒక కార్పొరేషన్ మార్జిన్ రూపంలో చూపెట్టే అధికారం రాష్ట్రానికి ఉన్నదా? పన్నుగ రావాల్సిన ఆదాయాన్ని కార్పొరేషన్ ఆదాయంగా చూపెట్టడం సరైన విధానమా అంటూ ప్రశ్నించారు. ఒక టర్మ్‌లో తమ అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసంఆ పన్నులను మరొక రకంగా తాకట్టుపెట్టి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయడం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభానికి తెర తీయడం కాదా అన్నారు. మౌలికమైన రాజ్యాంగ పర ఆర్థిక పర అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ కేసులో సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్ళటం మంచిది అన్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa