రానున్న 24 గంటల్లో సీమ, కోస్తా జిల్లాలలో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా రుతుపవనాలు విస్తరించాయి. కోస్తాలో కళింగపట్నం వరకు వచ్చిన రుతుపవనాలు రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దీనికి తోడు తమిళనాడుకు ఆనుకుని బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రుతుపవనాలు సీమ, కోస్తాల్లో చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రభావంతో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, సీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
మరోవైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్ఱభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa