ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇతరులతో పోల్చుకొంటే మా అప్పులు తక్కువే: వైసీపీ సోషల్ మీడియా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 05:53 PM

ఇతర రాష్ట్రాలతో పోల్చుకొంటే మా అప్పులేమీ పెద్దగా లేవని, తక్కువేనని వైసీపీ సోషల్ మీడియా పేర్కొంది. ఇందుకు కాగ్ నివేదికే నిదర్శనమని పేర్కొంది. ఇదిలావుంటే ఏపీని అప్పులకుప్పగా మార్చేశారని, ఏపీ మరో శ్రీలంకలా తయారవడం ఖాయమని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో స్పందించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ తీసుకున్న అప్పు తక్కువేనని కాగ్ చెప్పిందని పేర్కొంది. 2021-22లో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ద్రవ్యలోటు అత్యల్పం అని కాగ్ వివరించినట్టు తెలిపింది.  వైసీపీ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ నికర అప్పు (2021-22) విలువ 2.10 శాతం. అదే సమయంలో కేరళ నికర అప్పు విలువ 4.74 శాతం కాగా, తెలంగాణ 4.13 శాతం, తమిళనాడు 3.50 శాతం, మధ్యప్రదేశ్ 3.18 శాతం, కర్ణాటక నికర అప్పు విలువ 2.95 శాతం అని వైసీపీ వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa