వర్షాలు రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు వరదలు భీభత్సం కొనసాగుతుంటే బీహార్ లో మాత్రం పిడుగుపాటు అలజడికి గురిచేసింది. ఏకంగా 17 మంది ప్రాణాలను హరించేసింది. బీహార్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి పిడుగులు పడి 17 మంది చనిపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా భాగల్పూర్లో ఆరుగురు, వైశాలిలో ముగ్గురు, ఖగారియాలో ఇద్దరు, కతిహార్లో ఒకరు, సహర్సాలో ఒకరు, మాధేపూర్లో ఒకరు, బంకాలో ఇద్దరు, ముంగేర్లో ఒకరు మరణించారు. దీంతో బాధిత కుటుంబాలకు బీహార్ సీఎం నితిష్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. "బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తాం." అని సీఎం అన్నారు. అలాగే ప్రతికూల వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు బారిన పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండంటూ సూచించారు. కాగా ఒడిశా రాష్ట్రంలో కూడా పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు. నువాపాడా జిల్లాలోని మల్లికాముండ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విపత్తులో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అసోంలో వరద బీభ్సతంతో 55 మందికిపైగా చనిపోయారు. 32 జిల్లాలోని నాలుగు వేలకుపైగా గ్రామాలు ప్రభావితమయ్యాయి. వేల హెక్టార్లలో భూమి నీటమునిగింది. కాగా రాబోయే ఐదురోజుల్లో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రెండు, మూడు రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa