ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంద్ నేపథ్యంలో..కోచింగ్ సెంటర్ల మూసివేత

national |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 01:53 AM

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునివ్వడంతో ముందస్తు భద్రాత చర్యలో భాగంగా హర్యానాలో ఆర్మీ కోచింగ్ సెంటర్లను ముసివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసన కారుల దాడికి ఆర్మీ కోచింగ్ సెంటర్లే కారణమని అధికారులు తేల్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనలు దేశం హోరెత్తుతూనే ఉంది. ఇదిలాఉండగా అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిని ఎందుకు వెనక్కి తీసుకోవాలని, ఇది దేశాన్ని రక్షించే ప్రశ్న అని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి అన్నారు.


 హర్యానాలో అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలపై హర్యాణా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మహేంద్రహర్, ఝజ్జర్ జిల్లాల్లోని అన్ని ప్రైవేట్ కోచింగ్ సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఝజ్జర్ డిప్యూటీ కమిషనర్ కెప్టెన్ శక్తి సింగ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, అకాడమీలను క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆ జిల్లాలో 144 సెక్షన్ కూడా విధించారు.


దేశవ్యాప్త బంద్‌లో భాగంగా సోమవారం కూడా హర్యాణాలో ఆందోళనలు కొనసాగాయి. ఇందులో భాగంగా ఫతేహాబాద్‌లో కొందరు యువకులు లాల్‌బట్టి చౌక్‌ను దిగ్బంధించారు. మరికొందరు రోహ్‌తక్ జిల్లాలో రోడ్లపై నిరసన చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానాలోని అంబాలా, రేవారీ, సోనిపట్ సహా పలు రైల్వే స్టేషన్‌ల వద్ద భారీగా పోలీసులను మోహరించి.. పర్యవేక్షించారు.


నిజానికి హర్యానాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా నిరసనకారులు సోనిపట్‌లోని రోహ్‌తక్-పానిపట్ హైవేను దిగ్భంధించారు. కైతాల్, ఫతేహాబాద్, జింద్‌లలో కూడా నిరసనలు చేపట్టారు. అలాగే శనివారం మహేందర్‌గఢ్‌లో కొంతమంది యువకులు పికప్ వ్యాన్‌కు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసు అధికారి వెల్లడించారు. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, కార్యాలయాన్ని, జనరేటర్ సెట్‌ను ధ్వంసం చేశారని మహేందర్‌గఢ్ రైల్వే ఇంజనీర్ చెప్పారు. ఈ మేరకు హింసకు పాల్పడి ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa