ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం మాదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 12:14 PM

పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో వైయ‌స్ఆర్‌సీపీ విజయం సాధించింది. మూడేళ్లలో జరిగిన తిరుపతి లోక్‌సభ.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. 2019లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో 13,16,473 ఓట్లు (79.76 శాతం) పోలైతే.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ 7,22,877 ఓట్లు (55.03 శాతం) సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 4,94,501 (37.65 శాతం) ఓట్లు దక్కించుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ 2,28,376 ఓట్ల ఆధిక్యంతో అప్పట్లో విజయం సాధించారు. బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి 2021 ఏప్రిల్‌ 27న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో 11,05,468 (64.60 శాతం ఓట్లు పోలైతే.. వైయ‌స్ఆర్‌సీపీకి 6,26,108... 56.67 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీకి 3,54,516 (32.09 శాతం.. బీజేపీ–జనసేన అభ్యర్థికి 5.17 శాతం) ఓట్లు వచ్చాయి. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓడిపోయిన  తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు దూరంగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa