అనంతపురం జిల్లా, రాప్తాడునియోజకవర్గం, కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన కొంత మంది వైసీపీలో చేరారు. అనంతపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో మాజీ వార్డు మెంబర్ బాషా ఆధ్వర్యంలో కత్తె నారాయణ స్వామి, కత్తే పెద్దన్న, శ్రీరాములు, రెడ్డప్ప ఆచారి, ఆంజనేయులు, సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణ, ఆదిశేషు తదితరులు చేరారు. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తాము వైయస్ఆర్సీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa