టీడీపీలో రాయలసీమకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు పసుపు కండువా కప్ప అధినేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నరహరి పార్టీలో చేరడంతో ఆయనకు ఎంపీ సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాజంపేట లోక్సభ స్థానానికి ఆయన టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో డీకే సత్యప్రభ రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.. ఆవిడ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో రాజంపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో నరహరి అయితే బావుంటుందని భావిస్తున్నారట.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలావుంటే తాను టీడీపీ కోసం ఒక కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని నరహరి అన్నారు. ఈయన బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు.. అంతేకాదు 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు. అంతేకాదు నరహరి దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు.
అలాగే తటస్థులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు అధినేత చంద్రబాబు. రాజకీయాలకు దూరంగా ఉండేవారు, తటస్థులు తెలుగు దేశంలోకి రావాలని ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ పాలనలో సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని అన్నారు. ప్రజలు ఇప్పటికే టీడీపీకి మద్దతుగా వస్తున్నారని, ఆయా వర్గాల్లో ఉన్న ప్రముఖులు, విద్యావంతులు కూడా తెలుగు దేశంలోకి రావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa