ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యతో గొడవపడి బ్లేడుతో కోసుకున్న భర్త

Crime |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 01:37 PM

నాగర్‌కర్నూలుకు చెందిన మైసయ్య (40), దేవమ్మ (35) దంపతులు. ఉపాధి కోసం కొత్తూరుకు వలస వచ్చారు. స్టేషన్‌ తిమ్మాపూరులో నివాసముంటూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఇంటి వద్దే ఉన్న మైసయ్య మద్యం తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇరుగుపొరుగువారు వారించారు. అనంతరం ఆవేశానికి లోనైన భర్త కర్రతో భార్యను కొట్టాడు. అనంతరం బ్లేడుతో పొట్ట పైభాగంలో కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అంబులెన్స్‌లో షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa