భీమవరం సమావేశం చూసి భీమ్లానాయక్ బిగుసుకుపోయారని పవన్పై ఏపీ మంత్రి ఆర్.కె.రోజా సెటైర్లు పేల్చారు. మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు తహతహలాడడం అత్యాశే అవుతుందన్నారు.చంద్రబాబు, నారా లోకేష్లు, పవన్ కళ్యాణ్ ని జాకీలు వేసి లేపాలని చూస్తున్నారని ఆమె అన్నారు. కానీ జాకీలు విరిగిపోతున్నాయని కానీ వాళ్లు పైకి లేవడంలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు, సచివాలయాలు రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించేస్తున్నారని విమర్శించారు. అమెజాన్ సూపర్ వేల్యూ డేస్ | 1st-7th జులై వరకు | గ్రోసరీస్ & నిత్యావసరాలపై 45% వరకు తగ్గింపు
భీమవరంలో జరిగిన కార్యక్రమం ఒక అపురూప ఘట్టంగా అభివర్ణించారు రోజా. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఘన విజయం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ అంటున్నారని.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడి విగ్రహ ఆవిష్కరణలో భాగం కానివాళ్లు దురదృష్టవంతులు అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉండి ఓడిపోయిన లోకేష్.. జగన్కు సమానం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేసీఆర్ని చూసి విజయవాడకు వచ్చారని.. జగన్ను చూసి హైదరాబాద్ పారిపోయారి సెటైర్లు పేల్చారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. దేశమంతా చూసేలా ప్రభుత్వం అల్లూరి విగ్రహావిష్కరణ చేసిందని.. ప్రధాని మోదీని ఘనంగా స్వాగతించి కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa