పెట్రోల్ అంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొన్ని ఉపసమన చర్యలను తీసుకొంటోంది. తాజాగా 12 శాతం నుంచి 15 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేసింది. ఈ పెట్రోల్పై ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాల్సినవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ను( ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి మాత్రమే కాక, డీజిల్లో వంటనూనెలు కలిపిన బయోడీజిల్కి కూడా పన్ను ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు ఈ నోటిఫికేషన్లో పేర్కొంది.
భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారి. ఉక్రెయిన్-రష్యాకు మధ్య సంక్షోభం ప్రారంభమైన తర్వాత చమురు దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ఈ బిల్లు ఎగిసింది. 12 శాతం నుంచి 15 శాతం ఇథనాల్ కలిపే గ్యాసోలిన్కి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. అంతకుముందు 10 శాతం ఇథనాల్ కలిసి ఉన్న గ్యాసోలిన్కి పన్ను ప్రయోజనాలను కల్పించే వారు. ఇక డీజిల్ విషయానికి వస్తే.. వంట నూనెల నుంచి సేకరించిన యాసిడ్స్ను కలిపే 20 శాతం పోర్షన్కు పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి దేశంలో కొన్ని ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ను కలిపిన గ్యాసోలిన్ను ప్రవేశ పెట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను 2025-26 నుంచి అమల్లోకి తెస్తోంది. 10 శాతం ఇథనాల్ను కలిపిన పెట్రోల్ను అనుకున్న షెడ్యూల్ కంటే ముందస్తుగానే చేరుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో ప్రకటించారు. ఎనర్జీ భద్రత కోసం, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, విదేశీ కరెన్సీలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రొగ్రామ్ను ప్రోత్సహిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa