వర్షం పడుతున్నా, మబ్బులు పట్టినా, పిడుగులు పడుతున్నా, మెరుపులు మెరుస్తున్నా.. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జవసత్వాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి అంబటి రాంబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు అని వైసీపీ ప్లీనరీ సభలో తెలిపారు. మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకొని నాల్గవ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఇంకా రెండేళ్లు పూర్తిచేసుకొని ప్రజల చెంతకు వెళ్లి.. మళ్లీ వారి ఆశీస్సులు పొంది.. వన్స్మోర్ అనిపించుకొని సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకూ వెళ్లండని, మూడేళ్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించండి.. వారి ఆశీస్సులు పొందండి అని నాయకులు, కార్యకర్తలకు సీఎం వైయస్ జగన్ చెప్పారని గుర్తుచేశారు. ప్రతి ఇంటికీ వెళ్తున్నాం.. ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్ నినాదమే మార్మోగుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa