అన్నా డీఎంకేలో మళ్లీ ముసలం రాజుకొంది. అన్నాడీఎంకేలో ఓపీఎస్, ఈపీఎస్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిన వేళ.. పార్టీ నుంచి పన్నీరు సెల్వంను బహిష్కరించారు. ఈ మేరకు పళనిస్వామి నాయకత్వంలో వంగరంలో జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ట్రెజరీగా ఉన్న పన్నీరు సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారు. ఓపీఎస్తోపాటు ఆయన మద్దతుదారులైన ఆర్.వైథిలింగం, జేసీడీ ప్రభాకర్, పాల్ మనోజ్ పాండియన్లను సైతం పార్టీ నుంచి బహిష్కరించారు.
ఈ విషయమై పన్నీరు సెల్వం స్పందిస్తూ.. తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు ఈపీఎస్ లేదా కేపీ మునుస్వామికి లేదన్నారు. చట్ట ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నారు. పళనిస్వామి, మునుస్వామిలను తానే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యాలయం బయటి నుంచి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ కోఆర్డినేటర్గా కోటిన్నర మంది అన్నాడీఎంకే కార్యర్తలు ఎంపిక చేశారని ఆయన తెలిపారు. పన్నీరు సెల్వానికి డీఎంకేతో సంబంధాలు ఉన్నాయని ఈపీఎస్ ఆరోపించారు. ఆయన పార్టీకి సంబంధించిన వస్తువులను బయటకు తీసుకెళ్లారన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం చెన్నైలోని రాయపేటలో ఉన్న అన్నాడీఎం ప్రధాన కార్యాలయం వద్ద డ్రామా చోటు చేసుకుంది. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలకు చెందిన వారు పరస్పర దాడులకు దిగారు. ఈ దాడుల్లో 25 మంది వరకు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు పార్టీ ఆఫీసును సీల్ చేశారు. పోలీసులు రక్షణ మధ్య సోమవారం మధ్యాహ్నం అన్నాడీఎంకే ఆఫీసుకు వచ్చిన ఆర్డీవో సాయి వర్ధిని.. పార్టీ ఆఫీసులో ఉన్న ఓపీఎస్, ఆయన మద్దతుదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa