ప్రత్యేక హోదా వల్ల ఒరిగిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం ఇక ముగిసిన అధ్యాయంగానే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై మరొక్కసారి పాత విషయాలే చెప్పింది. లోక్ సభలో మంగళవారం (జులై 19) ఉదయం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ‘ఏపీ స్పెషల్ స్టేటస్’ అంశంపై ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని.. విభజన చట్టం ప్రకారం ఏపీకి చేయాల్సిదంతా చేస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు, ఇవ్వని రాష్ట్రాలకు అభివృద్ధి విషయంలో తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచాం. రెవెన్యూ లోటున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు ఇస్తోంది. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించింది’ అని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. విభజన చట్టం హామీలను చాలావరకూ నెరవేర్చామని మంత్రి తెలిపారు. కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే 28 సమావేశాలు ఏర్పాటు చేశామని నిత్యానందరాయ్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa