అంతా ఆన్ లైన్ మయం అయ్యాక మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఐఆర్సీటీసీ నుంచి రీఫండ్ ప్రక్రియ పేరిట మోసాలు జరిగే అవకాశం ఉందని.. రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే హెచ్చరించింది. ‘‘అనుమానాస్పద కాల్స్, లింకుల విషయంలో రెస్పాండ్ కావద్దని రైల్వే సేవ ప్రయాణికులను ఉద్దేశించి ట్వీట్ చేసింది. రెస్పాండ్ అయితే ఆర్థిక మోసాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొంత మంది ఐఆర్సీటీసీ యూజర్లు తమ బుకింగ్, రీఫండ్ విషయమై ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వారిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది.
‘కొంత మంది ఫోన్లు చేయడంతోపాటు, లింకులు పంపుతున్నారు. రీఫండ్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్. ఐఆర్సీటీసీ రీఫండ్స్ విషయంలో మానవ ప్రమేయం లేదు. అలాంటి లింక్స్, కాల్స్కు స్పందించొద్దు’ అని ఐఆర్సీటీసీ అధికారులు సూచించారు. ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఓ ట్విట్టర్ యూజర్ ఫ్రాడ్ కాల్ గురించి వివరిస్తూ.. రైల్ సేవను ట్యాగ్ చేశారు. దీంతో ఫిర్యాదు పట్ల స్పందించిన రైల్ సేవ.. పీఎన్ఆర్ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలు సేకరించారు. ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం రైల్ సేవ అధికారులు బాధితుడికి ఓ లింక్ పంపారు.
మరో వ్యక్తి తనకు రీఫండ్ మొత్తం రాలేదని ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఐఆర్సీటీసీ అధికారులు అతడి ఫోన్ నంబర్, పీఎన్ఆర్ నంబర్, ట్రాన్సాక్షన్ ఐడీ అడిగారు. అతడికి రెండు ఫ్రాడ్ కాల్స్తోపాటు వాట్సాప్లో ఓ లింక్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తులు డబ్బులు రీఫండ్ చేస్తామని.. అందుకోసం గూగుల్ ఫామ్ నింపాలని సూచించారు.
‘భారతీయ రైల్వే, ఐఆర్సీటీసీ గానీ, ఆ సంస్థ ఉద్యోగులు గానీ.. మీకెప్పుడూ రిఫండ్ విషయంలో ఫోన్ చేయరు. మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, పాన్ నంబర్ తదితర వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని అడగరు. ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించరు’ అని ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ కస్టమర్లను అప్రమత్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa