వరద భాదితులకు అండగా నేనున్నా అంటూ టీడీపీ అది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాల పర్యటనకి ఈ రోజు బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... సంక్షోభాల్ని ఎదుర్కొని సంక్షేమం సృష్టించే దార్శనికుడు, ప్రకృతివిపత్తులు వస్తే ప్రజల్ని కాపాడే రక్షకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ఎప్పుడూ ప్రజాపక్షమే. వైసీపీ సర్కారు నిర్లక్ష్యంతో ప్రజలు నిండా మునిగారు. జగన్రెడ్డి నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి చేతులు దులుపుకుంటే...చంద్రబాబు గారి ఆదేశాలతో తెలుగుదేశం కేడర్ నుంచి లీడర్ వరకూ అంతా వరద సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు, నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరించేందుకు, అధైర్యపడొద్దు అండగా వుంటానంటూ భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు గారు వస్తున్నారు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa