రామాపురం మండలం సుద్దమల్ల పంచాయతీ దూదేకులపల్లెకు చెందిన మస్తాన్బీ (30) అనే వివాహిత గ్రామ సమీపంలోని మామిడి తోటలో సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఎస్. ఐ జయరాములు తెలిపారు. మస్తాన్బీకి నాలుగేళ్ల కిందట రాయచోటికి చెందిన షేక్ ఇమ్రాన్ వివాహం జరిగింది. ఇద్దరూ బతుకుదెరువు కోసం ఏడు నెలల కిందట కువైట్ కు వెళ్లారు. వీరికి పిల్లలు లేరు. ఈక్రమంలో తనకు వంశం లేదని, పిల్లలు కావాలని భార్యను భర్త వేధిస్తూ వచ్చారు.
రెండో వివాహం చేసుకుంటానని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరికీ గొడవలు జరుగుతూ వచ్చాయి. మస్తాబ్బీ భర్త బలవంతం మీద ఈనెల 21న కువైట్ నుంచి దూదేకులపల్లెకి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి భర్త ఫోన్ చేయకపోవడం, మాట్లాడకపోవడం వంటి కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈక్రమంలోనే గ్రామ సమీపం లోని మామిడి చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లె సి. ఐ వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మరి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa