మైనింగ్, విద్యుత్ శాఖ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని తన సొంత నివాసంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మధన్ మొహన్ రెడ్డి రాబోయే కాలంలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గురించి మరియు పలు విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో వైసీపీ పార్టీ తరఫునుంచి కష్టపడి అందరిని కలుపుకోవడమే కాకుండా అక్టోబర్ 01 తేదీ నుండి ఎన్రోల్మెంట్ ప్రక్రియలో సానుభూతిపరులను ప్రవేట్ స్కూల్ టీచర్లను రిజిస్టర్ చేయించి గెలుపుకు కృషిచేసి వైసిపి పార్టీ తరఫునుండి విజయం సాధించాల్సిందిగా పేర్కొన్నారు.
అనంతరం మదన్ మోహన్ రెడ్డి పలువురు కరస్పాండెంట్స్ ను కలిశారు. వీరిలో దేవపట్ల హరినాద్ రెడ్డి కాలేజీ అధినేత చక్రవర్తి రెడ్డి, విశ్వం విద్యాసంస్థల మరియు అపుస్మ రాయలసీమ అధ్యక్షులు అధినేత విశ్వనాథ రెడ్డి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa