గాజువాక 65 వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76 వార్డు వైసీపీ ఇన్ చార్జ్ దొడ్డి రమణ నేతృతంలో అరు స్వామి, దర్మిరెడ్డి రాము ఆర్థిక సహాయంతో శనివారం అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూ ధర్మ ప్రచార జిల్లా ప్రెసిడెంట్, తుమ్మిడి బ్రదర్స్తు తుమ్మిడి రామ్ కుమార్ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూకలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందాం అన్నారు.
అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసినదిగాకోరారు , ఈ కార్యక్రమంలో బొత్స వంశీ, మత్పర్తి చిన్నారావు, ఈశ్వరి, సండ్రాన్ని రాము, పెంటకోట పైడి రాజు, పి. నరసింహమూర్తి, తిప్పల స్వాతి, పండూరి రామారావు, పండూరి సత్యవతి, సావిత్రి, లక్ష్మి, నాగమణి, కవిత, స్వాతి, అరుణ, సరోజినీ , సొంతశ్, వరలక్ష్మి , బాధి లక్ష్మి , సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కాళీ, పప్పాల ఆదిలక్ష్మి, గోర్సు రామలక్ష్మి, పప్పుల పుష్ప, మంగ, రచయిత అభిరామ్, ముమ్మిడివరం నరసింహమూర్తి, పల్లం నర్సింగ్ రావు, పాముల వెంకట అప్పారావు తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa