వీసా గడువు ముగిసినా చాలా మంది విదేశీయులు ఇంకా భారత్ లోనే ఉండిపోయారని తేలింది. 2020లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 40 వేల మందికిపైగా విదేశీయులు దేశంలోనే ఉన్నారని కేంద్ర హోం శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా కట్టడికి దేశవ్యాప్త సుదీర్ఘ లాక్డౌన్ కొనసాగిన 2020లో 32.79 లక్షల మంది విదేశీయులు భారత్కు వచ్చారు. కేంద్ర గణాంకాల ప్రకారం.. 2019లో వీసా గడువు ముగిసిన 54,576 మంది, 2020లో 40,239 మంది విదేశీయులు ఇంకా దేశంలోనే ఉన్నారు. అయితే, వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకపోతే జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించడం సహా మళ్లీ దేశంలో అడుగుపెట్టకుండా నిషేధిస్తారని అధికారులు తెలిపారు.
వీసా గడువు ముగిసిన మొదటి 15 రోజులకు రూ.10,000, 16 నుంచి 30 రోజుల మధ్య రూ.20,000, 31 రోజులు దాటితే రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 2020 నుంచి డిసెంబరు 31, 2020 మధ్య 32,79,315 మంది విదేశీయులు భారత్ సందర్శనకు వచ్చారు. వీరిలో అమెరికన్లు 61,190 మంది, బంగ్లాదేశీయులు 37,774 మంది, బ్రిటన్ పౌరులు 33,323 మంది, కెనడినయన్లు 13,707, పోర్చుగల్ 11,668 మంది, అఫ్గన్లు 11,211 మంది, జర్మన్లు 8,438 మంది, ఫ్రాన్స్ పౌరులు 8,353 మంది, ఇరాకీలు 7,163 మంది, కొరియన్లు 6,129 మందితో పాటు 4,751 మంది పాక్ పౌరులు ఉన్నారు. భారత్కు విదేశీయులలో 71 శాతం మంది ఈ దేశాలకు సంబంధించినవారే.
దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 వరకూ తొలి దశ, మే 31 వరకూ రెండో దశ లాక్డౌన్ అమలు చేసింది. జూన్ నుంచి క్రమంగా సడలింపులతో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేసింది. అప్పటి నుంచి 2022 మార్చి 27 వరకూ విదేశీ విమాన ప్రయాణాలను నిలిపివేసింది. ఈ సమయంలో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలకు మాత్రమే విమానాలను నడిపింది. కరోనా వ్యాప్తితో విదేశీయులకు వీసా జారీపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa