ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీ జే-యోంగ్‌ కు దక్షిణ కొరియా క్షమాభిక్ష

international |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 08:45 PM

శ్యామ్‌సంగ్ సంస్థ వైస్-ఛైర్మన్ లీ జే-యోంగ్‌ కు ఊరాటనిచ్చేలా దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. లంచం, అపహరణ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న శ్యామ్‌సంగ్ సంస్థ వైస్-ఛైర్మన్ లీ జే-యోంగ్‌ కు దక్షిణ కొరియా ప్రభుత్వం శుక్రవారం క్షమాభిక్ష ప్రసాదించింది. ఆర్థిక కారణాలతో అవినీతికి పాల్పడిన వ్యాపారులను విడుదల చేసే దక్షిణ కొరియా సుదీర్ఘ సంప్రదాయానికి తాజా ఘటన ఉదాహరణ. లంచం, అపహరణ కేసులో గతేడాది జనవరిలో దోషిగా తేలిన బిలీనియర్ లీ జే-యాంగ్‌ కు అక్కడి కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే ఆయన 18 నెలల శిక్షను పూర్తిచేసుకున్నారు. దేశంలో నెలకున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి తన వంతు సహకారం అందించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ కొరియా వెల్లడించింది.


ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచం ధనవంతుల జాబితాలో 278 వ స్థానంలో ఉన్న లీ సంపద 2012 ఆగస్టు నాటికి 7.9 బిలియన్ డాలర్లు. శుక్రవారం ఆయనకు క్షమాబిక్ష లభించడంతో జైలు శిక్ష తర్వాత ఐదేళ్ల పాటు పూర్తిస్థాయి వ్యాపార కార్యకలాపాలపై విధించిన నిషేధం తొలగిపోయింది. ‘‘ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించింది.. ఆర్థిక మాంద్యం దీర్ఘకాలం కొనసాగుతుందని భయపడుతోంది.. లీతో పాటు క్షమాభిక్ష అందుకున్న ఇతర ఉన్నత స్థాయి అధికారులు, వ్యాపారులు.. సాంకేతికత, ఉద్యోగ కల్పనలో క్రియాశీల పెట్టుబడి ద్వారా దేశం నిరంతర వృద్ధి ఇంజిన్‌కు నాయకత్వం వహించగలరని’’ అని దక్షిణ కొరియా న్యాయశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.


లీ జే యోంగ్, లంచం కేసులో శిక్ష అనుభవిస్తున్న లోట్టో గ్రూప్ ఛైర్మన్ షిన్ డోంగ్ బిన్ సహా అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో మొత్తం 1,693 ఖైదీలను క్షమాభిక్షతో విడుదల చేశారు. ఇక, మాజీ అధ్యక్షుడు పార్క్ గ్యూన్ హై‌ను పదవిలో నుంచి దింపేందుకు చేసిన కుట్రతో లీ జే-యోంగ్‌కు సంబంధాలున్నట్టు విచారణలో తేలడంతో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష, జరిమానా విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa