తన వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పడం వింతగా ఉందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. తన వీడియో ఫేక్ అని పోలీసులే నిర్ధారించారని.. అయినా టీడీపీ దుష్ప్రచారం చేయడం తగదని హితవుపలికారు. టీడీపీ నేతలే ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసుల్లా, జడ్జిల్లా, సైంటిస్టుల్లా, ఇతర అధికారుల్లా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వారిని స్వతంత్రంగా దర్యాప్తు చేయనివ్వాలని గోరంట్ల మాధవ్ హితవు పలికారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముమ్మాటికి ఫేక్ వీడియో అని.. దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులు అడిగితే తన ఫోన్ ఇచ్చేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేప్ను స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తే.. తాను కూడా తన వీడియోను దర్యాప్తు చేయించేందుకు సిద్ధమని వెల్లడించారు. అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో చంద్రబాబు ఓటుకు నోటు ఆడియో పరీక్ష చేయించి.. అది తప్పుటిదని నిరూపించగలరా అని టీడీపీ నేతలకు గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. చంద్రబాబు ఆడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించగలరా అని ప్రశ్నించారు. బీసీల మెడపై కత్తిపెట్టి అణగదొక్కుతున్నారని. .అందుకే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.
టీడీపీ నేతలు కుట్రపూరితంగా తనపై ఫేక్ వీడియోలు సృష్టించారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఐ టీడీపీ సోషల్ మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్ వీడియోలను పంపారని.. టీడీపీ అనుకూల మీడియా ఈ వీడియోలను ప్రసారం చేశారని ఆరోపించారు. వీళ్లంతా చంద్రబాబుతో చేతులు కలిపారన్నారు. వీళ్లంతా కలిసి బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారని.. మంచి, చెడులు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa