ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని హీరో తో మజ్ను హీరోయిన్ అను ఇమ్యనుల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2017, 03:23 PM

యుద్ధం శరణం సినిమా తరువాత నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు ఉదయం నాగ చైతన్య కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ‘మ‌హానుభావుడు’తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్యనుల్ హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ ప్రాజెక్ట్ కు ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదివరుకు ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. మొదటిసారి వేరే దర్శకుడు ఈ సంస్థలో పనిచెయ్యడం విశేషం. ఈ సినిమా టైటిల్ ఏంటి ? మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa