సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ప్రమోట్ చేసుకుంటున్న చిరు రీసెంట్గా ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసి ఆయన ఇంట్లో సైరా స్పెషల్ షో ఏర్పాట్లు చేశారు. ఇలా ఆయన వెంకయ్యని కలసి బైటకు వచ్చారో లేదో జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ‘సైరా’ ప్రదర్శిస్తున్న ధియేటర్లపై దాడులకు దిగారు. ఈ దాడులు తూర్పు గోదావరి జిల్లాలో ప్రదర్శింప బడుతున్న ‘సైరా’ ధియేటర్స్ పైనె జరగాయి. ఈ దాడులలో ‘సైరా’ నిర్మాతులు ప్రకటిస్తున్న కలక్షన్స్ ఆధారంగా జీఎస్టీ సరిగ్గా జమ అయిందా లేదా? అని విచారణ చేస్తున్నట్లు వార్తలు సమాచారం. కాగా ‘సైరా’ రైట్స్ అమ్మకం జరిగే సమయంలో బయ్యర్లు చేసుకున్న ఒప్పందం ప్రకారం జీఎస్టీ మొత్తాన్ని కూడా నిర్మాత రామ్ చరణ్ చెల్లిస్తానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa