ప్రముఖ నటుడు, రచయిత, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. చైన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1939లో విజయనగరంలో ఆయన జన్మించారు. జోడీ చిత్రంలో ఆయన చివరి సారిగా నటించారు. 250కి పైగా చిత్రాల్లో గొల్లపూడి నటించారు. గొల్లపూడి మారుతిరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అమెరికా నుంచి బంధువులు రావాల్సి ఉండటంతో.. అంత్యక్రియలు నిర్వహించడంలో ఆలస్యమవుతుందని గొల్లపూడి కుటుంబ సభ్యులు తెలిపిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే గొల్లపూడి భౌతికకాయాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీనగర్లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa