బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్ శ్రీరామ్ లాగూ(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామ్ లాగూ పుణెలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 1927 నవంబర్ 16న శ్రీరామ్లాగూ జన్మించారు. ఇప్పటివరకు ఆయన211 పైగా హిందీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన మరాఠీ చిత్రాల్లో సిన్హాసన్(1980), సామన(1974), పింజ్రా(1973) ప్రముఖమైనవి. బాలీవుడ్ చిత్రాలైన జమానే కో దిఖానా హై(1981), ఖుద్దార్(1994), లావారిస్(1981), ఇన్సాఫ్కా తారాజు(1980) మొదలైన చిత్రాల్లో నటించారు. ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠా చిత్ర సీమ ఆయనను నటసామ్రాట్ గా గుర్తించింది పూణే యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎంఎస్ అభ్యసించారు. ఈఎన్టీ సర్జన్గా కూడా ప్రాక్టీస్ చేశారు. ఆయన సతీమణి దీపా లాగూ కూడా చిత్రసీమకు సంబంధించిన వారే. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి బాలీవుడ్ తో పాటు మరాఠి చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa