ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2019, 11:31 AM

తమిళ సీరియల్ నటి, యాంకర్ రేఖ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాట బుల్లి తెర నటిగా, యాంకర్ గా రేఖ మంచి పేరు తెచ్చుకున్నారు. రేఖ, గోపినాథ్ 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెరంబూర్ నటరాజన్ కోవిల్ వీధిలో ఉంటున్నారు. 6 నెలల క్రితమే గోపినాథ్ జేజే నగర్ లోని ఓ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. అక్కడ పని చేసే అమ్మాయితో గోపినాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై రేఖ, గోపీనాథ్ మధ్య తరచు గొడవలయ్యేవని సమాచారం. గురువారం కూడా గోపీనాథ్ రేఖతో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం అన్నానగర్ టీవీఎస్ కాలనీలో ఉన్న ఆఫీసుకు ఉదయాన్నే వెళ్లిపోయాడు. ఎవరు రాకముందే ఆఫీసుకు వెళ్లిన గోపీనాథ్ తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 8 గంటల సమయంలో ఆఫీసును క్లీన్ చేయడానికి వచ్చిన కార్మికుడు చూసి వెంటనే ఆఫీసు అధికారికి, పోలీసులకు సమాచారమిచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవతో పాటు, అప్పుల వల్ల గోపీనాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలింది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa