ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి హాట్ కామెంట్స్ చేసిన రాఖీ సావంత్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 25, 2017, 02:35 PM

సంచలనాలకు పెట్టింది పేరు అయిన బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో ఉండటాన్ని అలవాటుగా చేసుకున్న ఈ భామ.. ఈ సారి కొత్తగా పెళ్లైన జంట విరాట్ కొహ్లీ, అనుష్కా శర్మలను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు విసిరింది. వీటి ద్వారా పబ్లిసిటీ పొందే యత్నం చేస్తోంది రాఖీ సావంత్.


టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మల పేర్లను ప్రస్తావిస్తూ హాట్ కామెంట్స్ చేస్తే ఉచిత పబ్లిసిటీ బోలెడంత వస్తుందని రాఖీకి తెలియనిది ఏమీ కాదు కదా. అందుకే.. తెలివిగా వాళ్లపై పడింది.ఇంతకీ రాఖీ ఏమంటోందోంటే.. కొత్తగా పెళ్లి చేసుకున్న విరాట్, అనుష్కాలు తను ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ కండోమ్స్ వాడాలి..అని! సినిమాల్లో అవకాశాలు లేక, రియాలిటీ షోల వాళ్లూ పట్టించుకోకపోవడంతో.. రాఖీ ఇప్పుడు కండోమ్ యాడ్స్ మీద పడింది. ఒక బ్రాండ్ ను ఎండార్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ప్రమోట్ చేయడానికి విరాట్, అనుష్కాల పేర్లను వాడేసుకుంటోంది ఈ భామ.


 


తను ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ కండోమ్స్ చాలా క్వాలిటీతో ఉంటాయని, వాటికి తిరుగులేదు అని.. ఈ విషయంలో తను ఛాలెంజ్ చేయగలను అని రాఖీ చెప్పుకొచ్చింది. విరాట్, అనుష్కాలు తను ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ కండోమ్స్ వాడాలని.. వాటిని వాటిన తర్వాత పొందిన అనుభూతిని చెప్పాలని రాఖీ కోరడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa