'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి, తన కుమారుడు శివను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మిస్తున్న 'చూసీ చూడంగానే' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తనకు తల్లి పాత్రను దర్శకుడు ఆఫర్ చేశారని, అయితే తనకు ఆరోగ్యం బాగాలేక చేయలేదని చెప్పారు. ఆ పాత్ర తనకు నచ్చిందని చెప్పారు.
తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తే చేస్తానని, ఈ సినిమా సంగీతపరంగా హిట్ అవుతుందని భావిస్తున్నానని అన్నారు. సినీ పరిశ్రమలోకి మహిళా టెక్నీషియన్లు ఎక్కువమంది రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. మేల్ డైరెక్టర్, ఫిమేల్ డైరెక్టర్ అన్న భేదాభిప్రాయాలు తొలగిపోవాలన్నది తన అభిమతమని అన్నారు. కాగా, ఈ చిత్రంలో శివ సరసన వర్ష, మాళవిక హీరోయిన్లుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa