పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తాడా .. చేయడా అనే సందేహానికి తెరపడిపోయింది. ప్రస్తుతం ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'పింక్' రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలోని ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడానికి కూడా ఆయన అంగీకరించాడు.
అంతేకాదు హరీశ్ శంకర్ వినిపించిన ఒక కథకి కూడా ఆయన పచ్చ జెండా ఊపాడు. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాలో ఒక కీలకమైన పాత్రకిగాను యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'రంగస్థలం'లో మాదిరిగా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో అనసూయ రేంజ్ మారిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనుండగా, ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa