క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మొఘలాయిల కాలం నాటి పీరియడ్ నేపథ్యంలో ఉంటుందని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిచబోతున్నాడని, ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఓ కీ రోల్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక అనసూయ రోల్ కూడా ఈసినిమాలో దాదాపు 30నిమిషాల నిడివి కలిగిన ప్రాధాన్యం ఉన్న రోల్ అని తెలుస్తుంది. అలాగే ఇద్దరు హీరోయిన్స్ పాత్రలకు ప్రధాన్యమున్న ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ పేరు మొదటి హీరోయిన్ గా ఖరారైనట్లుగా చెబుతున్నారు. కియారా ఎంత పారితోషకం అడిగినా.. ఇవ్వడానికి క్రిష్ నిర్మాత ఏ ఏం రత్నం వెనుకాడలేదు కాబట్టి... కియారా, పవన్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లుగా ప్రచారమైతే జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa