ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8 సంవత్సరాల తరువాత కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న పూజా హెగ్డే..

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2020, 08:07 PM

తెలుగు లో వరస సినిమలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే ఇప్పుడు కోలీవుడ్‌లో సినిమా చేయబోతుంది.  అయితే హీరోయిన్‌గా తన కెరీర్‌ను పూజా మొదట తమిళ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. మిస్కన్ తెరకెక్కించిన ముగమూడి అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇందులో జీవా సరసన పూజా నటించగా.. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. ఇక ఈ సినిమా తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న పూజా. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఇక్కడ కూడా ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ.. ఆ తరువాత విజయాలు రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది.


ఇదంతా పక్కనపెడితే పూజాకు ఇప్పుడు కోలీవుడ్‌లో బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. విజయ్ హీరోగా సుధా కొంకర ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. ఇక సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఆఫర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పూజా.. ఈ అవకాశం వస్తూనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 8 సంవత్సరాల తరువాత కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది పూజా. కాగా ప్రస్తుతం సుధా కొంకర, సూర్య హీరోగా సూరరై పొట్రు(తెలుగులో ఆకాశమేహద్దుగా) అనే మూవీని తెరకెక్కించింది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa