దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ 11న విడుదలైంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది . మహేష్ బాబు నెక్స్ట్ వంశీ పైడిపల్లి అని అనుకున్నారు అందరు కానీ ఆ సినిమా అనుకోని కారణాల వలన ఆగిపోవడం జరిగింది. మూవీ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడానికి మాత్రం చాలా కారణాలే కనిపిస్తున్నాయి. నిజానికి మహర్షి సినిమా సమయంలోనే మహేష్ బాబుకు కథ చెప్పాడు వంశీ. అయితే అప్పుడు ఆ కథపై పెద్దగా మనసు పెట్టలేదు సూపర్ స్టార్. ఆ తర్వాత మంచి కథ ఉంటే చూద్దాంలే అన్నట్లుగా ఉన్నాడు. మహర్షి విడుదల కావడం.. విజయం సాధించడంతో వంశీకి అవకాశం ఇచ్చేసాడు సూపర్ స్టార్. కానీ ఆయన చెప్పిన కథ విషయంలో మాత్రం మహేష్కు అనుమానాలు అలాగే ఉండిపోయాయి. కొన్ని మార్పులు చేయాలని సూచించినా కూడా వంశీ నచ్చేలా కథను మార్చలేకపోయాడు. చివరికి మరోసారి ఫైనల్ వర్షన్ విన్న తర్వాత చూస్తే అందులో శ్రీమంతుడు, భరత్ అనే నేనుతో పాటు మహర్షి సినిమా పోలికలు కూడా మహేష్ బాబుకు కనిపించాయని తెలుస్తుంది. అందుకే మరో కొత్త కథను సిద్ధం చేయాలని కోరాడు మహేష్. కానీ అక్కడ కూడా వంశీ ఫెయిల్ అయ్యాడు. అలా కాకుండా ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేయాలని మహేష్ బాబుకు సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాంటి సమయంలో రీమేక్ సినిమాలకు తాను దూరమని చెప్పి పూర్తిగా సినిమాను పక్కనబెట్టేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా కథ నచ్చకపోవడంతోనే వంశీని దూరం పెట్టాడు మహేష్. అంతేకానీ పర్సనల్ కారణాలేవీ లేవని చెబుతున్నారు. వంశీని కాదని ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిపోయాడు మహేష్ బాబు. దాంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు సూపర్ స్టార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa