ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1978 లో 'పలాస'లో ఏం జరిగింది..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2020, 12:44 PM

కొత్త కథలను, కొత్త సినిమాలను సినీ ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే వుంటారు. కంటెంట్ బావుంటే చిన్న సినిమాను కూడా సూపర్ హిట్ చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇలా ట్రైలర్, టీజర్ తో విడుదలకు ముందే ఇండస్ట్రీలో కొత్తతరహా సినిమా గా ప్రశంసలు అందుకున్న చిత్రం 'పలాస 1978'. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. 1978 ప్రాంతంలో శ్రీకాకుళం లోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా కోసం పలాస ప్రజలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1978లో అసలు పలాసలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మార్చి 6 వరకు ఆగక తప్పదు. ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa