కరోనా భయంతో స్కూల్స్, థియేటర్స్, షూటింగ్స్, పెళ్ళిళ్ళు, పలు వేడుకలు ఇలా ఒకటేంటి జనసమూహంతో కూడిన ప్రాంతాలన్నీ కర్ఫ్యూ విధించినట్టుగా మారుతున్నాయి. ఇక ప్రతి ఏడాది ఘనంగా జరిగే హీరోల బర్త్డే వేడుకలు కూడా ఈ సారి రద్దు అవుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హీరోలే స్వయంగా రంగంలోకి దిగి తమ బర్త్ డే వేడుకలని జరపొద్దంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రామ్ చరణ్ తన అభిమానులకు ఓ విన్నపాన్ని లేఖ ద్వారా విన్నవించారు. ఈనెల 27న తన పుట్టిన రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన కోరారు. తన పుట్టిన రోజు నిర్వహించకపోవడమే ఫ్యాన్స్ తనకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.ఇప్పటికే టాలీవుడ్ నుండి కొత్త చిత్రాల విడుదల నిలిపివేయడంతో పాటు, షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రముఖ హీరోలు సైతం తమ జన్మదిన వేడుకలను నిర్వహించకూడని నిర్ణయించుకుంటున్నారు. మోహన్ బాబు సైతం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa