టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ అనుష్క కొత్త చిత్రం గురించిన సమాచారం తెలిసింది. ఒక బయోపిక్లో నటించే అవకాశం తలుపుతట్టుందని తెలిసింది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాలతో అనుష్క ఇమేజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. భాగమతి తర్వాత కొత్త చిత్రాల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆమె ఇమేజ్కు సరిపడే కథల లభ్యత కష్టమైంది. తాజాగా నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమెకు చివరి చిత్రం అని ప్రచారం జరిగింది. సినీరంగానికి వచ్చి 15 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవలే ఆమెకు ఘన సత్కారం జరిగింది. ఈ సత్కారం అనుష్కకు పరిశ్రమ నుండి వీడ్కోలు సభ అని పరిశ్రమ వర్గాలు స్పందించాయి. ఆమె వయసు రీత్య పెళ్లి కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనుష్కను ఓ బయోపిక్లో నటింపజేసే ప్రయత్నాలు సీరియస్గా జరుగుతున్నట్టు తెలిసింది. బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవదాసిగా పుట్టి సంగీత కళాకారిణిగా పేరు సంపాదించుకున్న నాగరత్నమ్మ ఆ తర్వాత యోగినిగా మారుంది. తన సంపదను కళలకు ధారపోసింది. ఆమె జీవితం నేటి తరానికి తెలియజెప్పాయనే సంకల్పం నిర్మాతల్లో ఉంది. నాగరత్నమ్మ పాత్రకు అనుష్క మాత్రమే న్యాయం చేయగలదని భావిస్తున్నారట. అనుష్క ఈ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa