నటి కళ్యాణి ప్రియదర్శన్ కన్నీరు పెట్టుకుంది. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా స్వీయ నిర్బంధంలో ఉన్న కల్యాణి ప్రియదర్శన్ ఈ 21 రోజుల పాటు.. 21 చిత్రాలను చూడాలని నిర్ణయించుకున్నారట.అందులో భాగంగానే ఆమె 'మిరాకిల్ ఇన్ సెల్ నెం:7' అనే ఓ టర్కీష్ సినిమా చూసి ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని ఆశిస్తున్నాను.. దయచేసి అందరూ ఈ సినిమాని చూడండి అని కల్యాణి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa