బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరీమ్ మొరానీకి బుధవారం కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే ఆయన ఇద్దరు కూతుర్లు జోవా మొరానీ, షాజా మొరానీలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం కరీం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే సోమవారం కరీం మొరానీ పెద్ద కూతురు షాజా మోరానీకి కరోనా పాజిటివ్ గా తేలింది. మంగళవారం ఆయన రెండో కూతురు జోయా మోరానీకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. షాజా మోరానీ అస్వస్థతగా ఉందని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆమెకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా వచ్చింది. షాజా మోరానీ ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చెల్లెలు జోయా మోరానీ ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.మార్చి మధ్యలో జోయా రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చింది. షాజా మోరానీ ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉంది. అయినా ఆమెకు కరోనా వైరస్ సోకింది. మరోవైపు కరీమ్ మోరానీ దంపతులు కూడా టెస్టులు చేయించుకున్నారు. కరీంకు కరోనా పాజిటివ్ రాగా ఆయన భార్యకు నెగటివ్ వచ్చింది. కరీమ్ మోరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా పాజిటివ్ గా తేలడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరు ముంబైలోని జుహు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు వారింట్లో పనివాళ్లతో సహా అందరికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. వారిని హోం క్వారంటైన్ లో ఉంచారు.‘యోధ’ (1991) చిత్రంతో నిర్మాతగా మారిన కరీమ్ మొరానీ ఆ తర్వాత షారుక్ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్ప్రెస్’(2013), ‘దిల్వాలే’ (2015) చిత్రాలకు కో ప్రొడ్యూసర్గా, ‘రా.వన్’(2011), ‘హ్యాపీ న్యూఇయర్’ (2014) చిత్రాలకు అసోసియేట్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. హీరో షారుఖ్ ఖాన్ కు కరీం ఆప్త మిత్రుడు. షాజా జరానీ.. ఆల్వేస్ కబీ కబీ, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. జోయా మోరానీ పలు చిత్రాల్లో నటించింది. వీరందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa