ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా హెల్ప్‌లైన్ సెంటర్‌లో హీరోయిన్ నిఖిల్ విమల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2020, 02:27 AM

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. కరోనా వైరస్‌ కారణంగా పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా ఏమి చేయాలో అవి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు కూడా కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా మలయాళ నటి నిఖిలా విమల్ ఓ అడుగు ముందుకేసి తన వంతుగా ప్రజలకు సాయం చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలు, మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న  ప్రజల కోసం కేరళ ప్రభుత్వం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. హీరోయిన్ నిఖిల్ విమల్ ఆ కాల్ సెంటర్‌లో పనిచేస్తూ..ఆపదలో ఉన్న వారికి ఈ వేదికగా సహాయ సహకారాలు అందజేస్తోంది.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తూ.. వారికి కావాల్సిన అత్యవసరాలు అందజేస్తోంది. ఈ కాల్ సెంటర్‌లో నిఖిల విమల్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తోంది. ప్రజా సేవలో ప్రముఖులు భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో ఈ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నట్టు నిఖిల చెప్పుకొచ్చింది. ప్రజలు తమ రోజువారి అవసరాల కోసం  బయటకు రాకుండా ఇంటి వద్దకే కావాల్సిన సామానులను అందజేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలతో ఇంటారాక్ట్ కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తున్నట్టు నిఖిల్ విమల్ ప్రకటించింది. ఈమె తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన మేడ మీద అబ్బాయి సినిమాలో కథానాయికగా నటించింది. తమిళంల, మలయాళంలో మాత్రం పలు హిట్ చిత్రాల్లో నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa