వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన'రానునుంది. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ సినిమాలోహీరోయిన్ తండ్రిగా .. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 2వ తేదీనే విడుదల కావలసింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కథాకథనాలు నచ్చడంతో, తమిళ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నాడు. హీరో విజయ్ మంచి టీనేజ్ లవ్ స్టోరీ దొరికితే తన తనయుడు జాసన్ సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వున్నాడు. ఆ విషయం తెలిసిన విజయ్ సేతుపతి, ఈ కథను గురించి విజయ్ కి చెప్పాడట. కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో తను చేసిన పాత్రనే తమిళంలోను విజయ్ సేతుపతి చేయనున్నాడట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa