ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగస్థలం సెట్ లో పూజా హెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2018, 02:24 PM

రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న రంగస్థలం సెట్ లో పూజా హెగ్డే అడుగు పెట్టేసింది. షూటింగ్ లో మిగిలిపోయిన చివరి ఐటెం సాంగ్ చిత్రీకరణ సుకుమార్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాడు. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ కి చరణ్ పూజా వేసే స్టెప్స్ కి థియేటర్ మోతెక్కిపోవడం ఖాయం అంటున్నారు యూనిట్ మెంబెర్స్. రెండు రోజుల క్రితమే సమంతా తనవరకు షూటింగ్ అయిపోయిందని విడుదల కోసం ఎదురు చూడటమే మిగిలుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూజా హెగ్డే సాంగ్ షూట్ అయ్యాక గుమ్మడి కాయ కొట్టేస్తారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో సుక్కు దీన్ని తీస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన నేపధ్యంలో ప్రమోషన్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్.


డిజే సినిమాలో బికినీతో అందరి మతులు పోగొట్టిన పూజా హెగ్డే సాంగ్ రంగస్థలంలో స్పెషల్ అట్రాక్షన్ గా మిగలనుందని టాక్. సుక్కు-దేవి కాంబోలో ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం ఐటెం సాంగ్ నుంచే టాలీవుడ్ లో వీటికి బాగా ప్రాధాన్యం పెరిగింది. ఇక అది మొదలు దాదాపు తన ప్రతి సినిమాలో కిక్కిచ్చే ఒక పాటను సుకుమార్ పెడుతూనే ఉన్నాడు. రామ్ తో చేసిన జగడం అంత పెద్ద ఫ్లాప్ అయినా పాటలు ముఖ్యంగా ఐటెం నెంబర్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. క్లాస్ సినిమాల్లోనే అలాంటి పాటలు పెట్టిన సుక్కు ఇక ఊర మాస్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటిది సెట్ చేసుకుంటాడో ఊహకు అందటం కష్టమే.


పూజా హెగ్డే మొదటిసారి ఐటెం సాంగ్ చేస్తోంది. డిజే తర్వాత తను ఒప్పుకున్న ఒకే ఒక్క సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సాక్ష్యం. దీని తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే 25వ సినిమాలో కూడా తనే హీరొయిన్ గా ఓకే అయినట్టు టాక్. ఇంత క్రేజ్ లోను రామ్ చరణ్ తో సింగల్ సాంగ్ కోసం ఒప్పుకుంది అంటే అందులో చాలా ప్రత్యేకత ఉండే ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa