ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా తర్వాత అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంద' నిర్మాత శోభు యార్లగడ్డ

cinema |  Suryaa Desk  | Published : Tue, May 19, 2020, 05:51 PM

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత  సినీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతోందనే సందేహాలు అందరిలో ఉన్నాయి. దీనిపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ తన అభిప్రాయాలను పంచుకున్నారు.కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదని 'బాహుబలి' నిర్మాత శోభు చెప్పారు. ఆడియో లాంచ్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ వంటివి ఉండవని తెలిపారు. ప్రమోషన్ల కోసం రోడ్ ట్రిప్ లు, మాల్స్ కు వెళ్లడం, థియేటర్స్ కు వెళ్లడం వంటివి ఉండవని అన్నారు. అంతా ఆన్ లైన్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే జరుగుతుందని చెప్పారు.మరోవైపు, శోభు యార్లగడ్డ నిర్మించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 17నే ఇది ప్రేక్షకుల ముందుకు రావాల్సి వున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa