ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాల్వన్ ఘటన నేపథ్యంలో నటి సాక్షి అగర్వాల్ కీలక నిర్ణయం...

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 12:28 PM

గాల్వన్ ఘటన నేపథ్యంలో చైనా తీరుపై దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ నటి సాక్షి అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా దేశ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించబోనని తెగేసి చెప్పి దేశంపై తనకున్న ప్రేమను చాటుకుంది. అంతేకాదు, చైనా ఉత్పత్తులను కూడా వినియోగించబోనని స్పష్టం చేసింది.


మన సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవాలని చూస్తోందన్న నటి.. శాంతికి, సహనానికి భారతదేశం చిరునామా అని పేర్కొంది. మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకే మన సైన్యంపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తీరుకు నిరసనగా ఆ దేశ ఉత్పత్తులను వినియోగించకపోవడమే కాకుండా, ఆ దేశ ఉత్పత్తుల ప్రకటనల్లోనూ నటించబోనని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa