సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య బాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే అసలు సుశాంత్ది ఆత్మహత్య కాదని.. హత్య చేశారని ఆయన అభిమానులతో పాటు కొందరు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. అందులో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ముందు వరసలో ఉన్నారు. సుశాంత్ సింగ్ను ముమ్మాటికీ చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ను చంపేశారనడానికి ఆధారాలు ఇవే అంటూ ఓ లిస్టును ఆయన ట్వీట్ చేశారు. సుశాంత్ కేసులో మొత్తం 26 సాక్షాధారాలు ఉన్నాయని సుబ్రమణ్య స్వామి అన్నారు. అందులో ఆత్మహత్య చేసుకున్నాడని అనుకోవడానికి రెండే ఆధారాలున్నాయని.. కానీ హత్య చేశారనడానికి 24 ఆధారాలు ఉన్నాయని సంచలన వాఖ్యలు చేశారు. సుశాంత్ది హత్యగానే భావిస్తున్నానని కొన్ని కీలక పాయింట్లను లేవనెత్తారు.మెడ మీద ఉన్న గుర్తులు, కళ్లు తేలేయక పోవడం, ఫ్యాన్కు వేలాడుతున్న గుడ్డ, శరీరం మీద ఉన్న వేర్వేరు గుర్తులు, సీసీటీవీ ఫుటేజీ, సుశాంత్ సన్నిహితుల ప్రవర్తన, దిశా సలియన్ ఆత్మహత్య, సూసైడ్ నోట్ కనిపించకుండా పోవడం, సుశాంత్ పదే పదే సిమ్ కార్డులను మార్చడం తదితర కారణాలు హత్య అనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. డిప్రెషన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వంటి అంశాలు మాత్రమే సూసైడ్ చేసుకున్నాయని చెప్పడానికి.. మిగతా 24 అంశాలు మాత్రం హత్య చేశారని చెప్పడానికి సూచిస్తున్నాయన్నారు. సుశాంత్ కేసుకు సంబంధించి సుబ్రమణ్యస్వామి ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్తో మాట్లాడారు. కేసును సీబీఐకి అప్పగిస్తేనే నిజాలు బయటకొస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పట్నాలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa