బాలీవుడ్ లో నటి పాయల్ ఘోష్ మీటూ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడంటూ ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో పలువురు స్పందిస్తున్నారు. కొందరు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కు మద్దతు పలుకుతుంటే మరికొందరు పాయల్ ఘోష్ కు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై నటి కస్తూరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను కూడా ఇలాంటి వేధింపులనే ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా నటి పాయల్ ఘోష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ పై చేసిన ఆ ఆరోపణలు కోర్టులో నిలవలేవంటూ తన న్యాయపరమైన అభిప్రాయాన్ని పంచుకుంది. స్పష్టమైన ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు నిరూపించటం అసాధ్యమని అభిప్రాయపడింది. అయితే ఈ ఆరోపణలు మాత్రం ఇద్దరిలో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తాయి అని స్పష్టం చేసింది. అయితే కస్తూరి కామెంట్స్ పై ఓ నెటిజన్ నిలదీశాడు. ఇలా మీ కుటుంబంలో గానీ లేదా మీకు దగ్గరగా ఉన్న ఎవరికైనా జరిగితే ఇలానే మీరు చట్టపరమైన అభిప్రాయాన్ని ప్రస్తావిస్తారా అని ప్రశ్నించారు.
దాంతో నెటిజన్ ప్రశ్నపై స్పందించిన కస్తూరి తన కుటుంబంలో కాదు..తనకే జరిగిందంటూ చెప్పుకొచ్చారు. తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే తనను వేధించిన వ్యక్తి గురించి ప్రస్తావించలేదు. ఇకపోతే గతంలో కూడా కస్తూరి లైంగిక వేధింపుల అంశాన్ని ప్రస్తావించారు. చాన్స్ ల పేరుతో గదికి రమ్మనే అలవాటు సినీ పరిశ్రమలో ఉన్నట్లు అంగీకరించింది. ఒక హీరో తనను రమ్మన్నాడని..ఒప్పుకోక పోవడం వలన తనకి చాన్స్ లు రాకుండా చేశాడని ఆరోపించింది.
ప్రస్తుతం ఆ హీరో రాజకీయ నేతగా కొనసాగుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే కస్తూరి నిప్పురవ్వ, అన్నమయ్య, భారతీయుడు వంటి సినిమాల్లో నటించారు. పెళ్లి చేసుకోవడంతో ఆమె అమెరికాకులో సెటిల్ అయ్యింది. ఆమెకు కొడుకు కూతురు సంతానం. ప్రస్తుతం కస్తూరి తెలుగు పాపులర్ సీరియల్ గృహ లక్ష్మిలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa