పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ రెండింటిని చక్కగా బాలన్స్ చేస్తున్నాడు.ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున వీలైనన్ని సినిమాలు చేయాలనీ పవన్ అనుకుంటున్నాడు.పవన్ కల్యాణ్ .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' తరువాత మరో సినిమా రాలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆ తరహా సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనేది తాజా సమాచారం.ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. తండ్రి పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు కోసం పవన్ నెలకి 10 రోజులు కేటాయించారని అంటున్నారు. అంటే ఒక వైపున 'హరహర మహాదేవ' .. మరో వైపున 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తూనే, ఈ సినిమా షూటింగులోను పవన్ పాల్గొననున్నారన్న మాట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa