ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 27, 2021, 05:00 PM

టాలీవుడ్‌‌ డ్రగ్స్ కేసు మరోసారి సంచలనంగా మారింది. అనూహ్యంగా ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి. కాగా ఈడీ విచారణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓ సరికొత్త విషయం వెలుగుచూసింది. అదే డార్క్‌ వెబ్‌, బిట్‌ కాయిన్ పేమెంట్స్. ఈ కేసులో డ్రగ్స్‌ను మించి డబ్బు వ్యవహారం, హవాలా లాంటి ఆర్థిక నేరాలు ఈడీ దర్యాప్తులో బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కెల్విన్‌ కు అమెరికాలోని అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయి. అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. ఇందుకోసం డార్క్‌ వెబ్‌సైట్ లోనే ఆర్డర్లు జరిగాయి. సరుకు దిగుమతికి మాత్రం కొరియర్ సర్వీస్‌ ను వాడుకున్నారు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్ ద్వారా కూడా ఎగుమతులు జరిగాయి. బిట్‌కాయిన్ ద్వారా చెల్లింపులు జరిగాయి. బిట్‌ కాయిన్ రూపంలో చెల్లింపులు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బిట్ కాయిన్ డిజిటల్ కరెన్సీ కావడంతో దీనిపై ఫోకస్ పెట్టారు. ఈ మార్గంలో ఎప్పటినుంచో డ్రగ్స్‌కు చెల్లింపులు చేసినట్టు ఈడీకి సమాచారం అందింది. అందుకే మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ప్రస్తుతం ఈడీ సీరియస్‌గా దర్యాప్తు జరుపుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa