తెలుగు చిత్రసీమలో నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసి క్లీన్ చీట్ ఇచ్చిన కేసులో.. మనీలాండరింగ్ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రగ్ సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ - నటి ఛార్మీ కౌర్ లను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈరోజు శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే 2017లో ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ - రానా దగ్గుబాటి పేర్లు లేవు. సిట్ విచారించిన సెలబ్రిటీలలో కూడా వీరిద్దరూ లేరు. అలాంటిది ఈడీ ఇద్దరినీ విచారణ చేయడం గురించి చర్చ జరుగుతోంది.
అయితే ఇక రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సెప్టెంబర్ 8న రానా - 9న రవితేజ మరియు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ - 13న నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ పబ్ జనరల్ మేనేజర్ - 15న ముమైత్ ఖాన్ - 17న తనీష్ - 20న నందు - 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa