ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ 'భీమ్లా నాయక్' నుంచి న్యూ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 03, 2021, 09:44 PM

పవన్ హీరోగా 'భీమ్లా నాయక్' అనే మూవీ షూటింగ్ జరుగుతుంది, ఈ వినిమాలో రానా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. హీరోయిన్గా నిత్యామీనన్ పవన్ సరసన నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ పరిచయం కాబోతుంది. రేపు బీమ్లానాయక్ మూవీ నుండి ఫోర్త్ సింగిల్ విడుదల అవుతుందని మూవీ టీం ప్రకటించింది.  సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ మూవీకి రీమేక్. ఈ సినిమా నుంచి ఇంతవరకూ మూడు సింగిల్స్ వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గొవ సింగిల్ ను ఈ నెల 1వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సిరివెన్నెల మరణం కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆ ఫోర్త్ సింగిల్ ను రేపు ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'అడవితల్లి మాట' అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి సంక్రాంతికి ఒక రేంజ్ లో పోటీ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa