ఈమద్య కాలంలో సౌత్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తుంది. దాంతో ఒకప్పుడు ఒకటి రెండు కోట్లు కాస్త అటు ఇటు బడ్జెట్ తో రూపొందిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. భారీ ఎత్తున రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మార్కెట్ కూడా బాగానే ఉంది. ప్రేక్షకులు కోట్లు కురిపిస్తున్నారు. అరుంధతి సినిమా దీనికి నాంది పలికింది అని చెప్పుకోవచ్చు.
బాలీవుడ్ తరహాలో మన సౌత్ లో కూడా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కు మంచి ఆధరణ లభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెడీ గా ఉన్న కథలను తెరపైకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ఒక కథ తో రూపొందుతున్న సినిమానే కలియుగం.
కన్నడం లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని తెలుగు లో కూడా కొన్ని సినిమాల్లో నటించి జెర్సీ సినిమా లో ఒక మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న శద్దా శ్రీనాథ్ ఈ సినిమాను చేస్తోంది. ఇది ఇండియాలోనే మొదటి అలౌకికమైన కథతో రూపొందిన సినిమా గా చెబుతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా ఏంజాయ్ చేసే విధంగా ఉంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ ను మొదలు పెట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమా చిత్రీకరణ కు భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలియజేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. చివరి షెడ్యూల్ ను వచ్చే నెల లో పూర్తి చేస్తామన్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లుగా నిర్మాత వెళ్లడించారు. సినిమాను 2022 లో ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa